న్యూఢిల్లీ : జూన్ 22-23 తేదీల్లో రెండురోజులపాటు జరగనున్న బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీ వేదిక అయింది. ఈ సమావేశానికి చైనా విదేశాంగమంత్రి వాంగ్యి, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు, ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి డిప్యూటీ సెక్రటరీ ఘదీర్ నెజామిపూర్లతోపాటు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా- ఇరాన్ అవగాహన ఒప్పందాన్ని భారత్ స్వాగతిస్తుందని భారత జాతీయ సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఇంధన భద్రత, ఆర్థిక శ్రేయస్సును పెంపొందిస్తుందని, హోర్ముజ్ జలసంధిని తెరవడం చాలా స్వాగతించదగిన పరిణామం అని ఆయన స్పష్టం చేశారు.








కామెంట్లు (0)