జనం ఇళ్లల్లో దీపాలు ఆర్పాలని చూసినపుడు ...
అందరి జీవితాల్లో వెలుగుల కోసం ఉద్యమించి ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా విశాల ప్రపంచమంతటికీ ఉద్యమ పాఠాలు నేర్పి ఐక్యత ఆవశ్యాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచి ఎన్నటికీ మరువని మన ఇంటి బిడ్డలుగా మిగిలిన వీరులారా..మీ ముగ్గురికి ఇవే వందనాలు..!!
పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా 2000 ఆగష్ట్ 28 నాడు హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఉద్యమిస్తున్న వారిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపింది.
రామకృష్ణ, విష్ణువర్థన్, బాలాస్వామి అనే ముగ్గురు యువకిశోరాల ప్రాణాలు తీసింది.
ఈ ఉద్యమ ఫలితంతోనే ఆంధ్రప్రదేశ్ లో 10ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వాలు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. 












కామెంట్లు (0)