కోజికోడ్ : కోజికోడ్లో CPI(M) కేరళ రాష్ట్ర కమిటీ మూడు రోజుల విస్తృత సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ముందుగా సీనియర్ నాయకులు కామ్రేడ్ పలోలి మహమ్మద్ కుట్టి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పొలిట్బ్యూరో సభ్యులు కామ్రేడ్లు అశోక్ ధావలే, యు.వాసుకి, విజూ కృష్ణన్, బి.వి.రాఘవులు, ఎ.విజయరాఘవన్, పినరయి విజయన్, ఎం.వి.గోవిందన్ మాస్టర్ పాల్గొన్నారు. పార్టీ కొత్త కార్యక్రమాలు కార్యకలాపాలకు మరింత స్పష్టతను, నిర్దిష్ట దిశను అందించేలా ఈ సమావేశంలో చర్చలు జరిపి నేతలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో CPI(M) ఓటమికి గల కారణాలను పరిష్కరించడానికి, ప్రజల్లో పార్టీ ప్రభావాన్ని, ఉనికిని మరింత బలోపేతం చేయడానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు.










కామెంట్లు (0)