ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కనీస మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు

2 రోజుల క్రితం

farmes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 30, 2026, 01:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

భోపాల్: మధ్యప్రదేశ్‌లో రైతులు కనీస మద్దతు ధర కోసం రోడ్డెక్కారు. సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్‌ ‌మోర్చా ( ఎస్‌‌కెఎం)తో పాటు పలు రైతు సంఘాలు భోపాల్‌ మార్చ్‌ ‌కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే భోపాల్‌ ‌సరిహద్దు ప్రాంతమైన హోషంగాబాద్ రోడ్డులో మంగళవానం పోలీసులు బారికేడ్‌‌లు అడ్డుపెట్టి రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆగ్రహించిన అన్నదాతలు అక్కడే భైఠాయించారు.

రైతుల డిమాండ్స్‌...

  • మూంగ్ (పెసలు) పంటను 100 శాతం ప్రభుత్వం కొనుగోలు చేయాలి.

  • ఎరువుల పంపిణీకి ఉపయోగించే ఇ-టోకెన్ వ్యవస్థను రద్దు చేయాలి.

  • ఎరువులను తగినంతగా అందుబాటులో ఉంచాలి.

  • తమ ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించాలి.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్