సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వరద బురద కరాళనృత్యం

1 గంట క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పర్వతం కంటి నుండి​

నదిలా ప్రవహించిన శోకం​

ఆకాశం నేలకొరిగిన క్షణం,​

సృష్టి తన సంతకాలను​

తానే తుడిచేసుకున్న సమయం.

కోపంతో ఉప్పొంగిన ప్రవాహానికి​

దేశాల సరిహద్దులు తెలియవు.​

కుంభవృష్టిగా కురిసే మట్టి మేఘాలకి​

పాస్‌పోర్టులు, వీసాలు అక్కర్లేదు.

​రక్తాశ్రువుల ఏటిలో మునిగిన నగరాలు,​

ఇది కేవలం రాళ్లూ రప్పల కూల్చివేత కాదు,

​అహంకారపు శిఖరాలకు ప్రకృతి పేర్చిన సమాధి.​

కాలపు పుటల్లో మిగిలిన ఒక నల్లని మచ్చ,​

శిఖరాల నుండి రాలిన కన్నీరు​

నేలతో కలిసి బురద ముసుగు తొడిగింది.

​పచ్చని పొలాలు శిథిలారణ్యాలై,​

ఇళ్ల వాకిళ్లు సమాధి రాళ్ళుగా మారాయి.​

తొక్కిన అడుగు ప్రతిదీ పూడికైపోగా,​

కన్న కలలన్నీ బురద ఒడిలో కరిగిపోయాయి.

​కేకలు కూడా మూగబోయిన చోట​

కళ్ల ముందే మునిగిపోయిన ఆశలు.

​అది నీటి ప్రవాహం కాదు,​

ప్రకృతి కోపపు విలయ దావానలం.​

ఇప్పుడిక్కడ మిగిలింది​

ఒకే భూమి, ఒకే శోకం, ఒకే విలయం.


​- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,

సెల్‌: 8008577834


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్