బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Women’s Asia Cup : సెమీస్‌లో భారత్‌తో బంగ్లాదేశ్‌ ఢీ

9 గంటల క్రితం

BANGLADESH.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 11:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కీలక పోరులో యుఎఇపై బంగ్లా మహిళల గెలుపు

దుబాయ్‌: ‌మహిళల ఆసియాకప్‌ సెమీఫైనల్లో భారత్‌ ప్రత్యర్ధి ఎవరో తేలిపోయింది. మంగళవారం జరిగిన గ్రూప్‌ లీగ్‌ చివరి పోరులో బంగ్లాదేశ్‌ జట్టు 34 పరుగుల తేడాతో ఆతిథ్య యుఎఇపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులకు ఆలౌటయ్యారు. ఛేదనలో భాగంగా యుఎఇ మహిళలు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 69 పరుగులే చేసి ఓటమిపాలయ్యారు. బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో షమీమ్‌ అక్తర్‌(38), కెప్టెన్‌ నిఘర్‌ సుల్తానా(23) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. యుఎఇ బౌలర్లు సురక్ష‍కు మూడు, నందకుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం రుబేయా ఖాన్‌(3/14), మరుఫా అక్తర్‌(2/9), నహిదా అక్తర్‌(2/18) కట్టుదిట్టంగా బౌల్‌ చేసి యుఎఇ బ్యాటర్లను కట్టడి చేశారు. 10న తొలి సెమీస్‌లో భారత్‌తో బంగ్లాదేశ్‌, 11న రెండో సెమీస్‌లో శ్రీలంకతో పాకిస్తాన్‌ మహిళలు తలపడనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్