హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్ ప్రతిభను గుర్తించేందుకు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో ఆగస్టు 6న విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో సెలెక్షన్స్ నిర్వహించనున్నారు. ఉదయం అండర్-21 గార్డియన్స్ ట్రోఫీ ట్రయల్స్, సాయంత్రం ప్రైమ్ వాలీబాల్ లీగ్ ప్రధాన జట్టు కోసం ఓపెన్ ట్రయల్స్ జరుగుతాయని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన జట్టు ట్రయల్స్కు హాజరయ్యే ఆటగాళ్లు ముందుగా పివిఎల్ ఆక్షన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.








కామెంట్లు (0)