మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలుసానె డైమండ్‌ లీగ్‌ బరిలో నీరజ్ చోప్రా

4 గంటల క్రితం

neeraj-chopra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 10:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: భారత స్టార్‌ ‌జావెలిన్‌ ‌త్రో ఆటగాడు నీరజ్‌ ‌చోప్రా లుసానే డైమండ్‌ ‌లీగ్‌‌పై దృష్టి సారించాడు. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా డైమండ్‌ ‌లీగ్‌ ‌ఫైనల్స్‌ ‌లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. బ్రసెల్స్‌ వేదికగా సెప్టెంబరులో డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ జరగనున్నాయి. డైమండ్‌ ‌లీగ్‌‌కు అర్హత సాధించాలంటే లుసానే డైమండ్‌ ‌లీగ్‌‌లో సత్తా చాటాల్సి ఉంది. రోమ్ లీగ్‌లకు దూరంగా ఉన్న నీరజ్‌.. కామన్వెల్త్‌ ‌క్రీడల్లో రజత పతకానికే పరిమితమయ్యాడు. జూన్‌లో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 85.69 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీంతో ప్రస్తుత డైమండ్ లీగ్ ఫైనల్‌ పాయింట్ల పట్టికలో నీరజ్ ఐదు పాయింట్లతో ఏడో స్థానానికి పడిపోయాడు. దీంతో ‌డైమండ్‌ ‌లీగ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే లుసానె లీగ్, జ్యూరిచ్ లీగ్‌లలో కనీసం ఒక దాంట్లోనైనా స్వర్ణ పతకాన్ని సాధించాల్సి ఉంటుంది. జ్యూరిచ్‌ ‌లీగ్‌ ఆగస్టు 27న జరగనుంది. లుసానె పోటీల్లో రుమేశ్‌ తరంగ(శ్రీలంక), అర్షాద్ నదీమ్(పాకిస్థాన్), కెషోర్న్ వాల్కాట్(ట్రినిడాడ్ అండ్ టొబాగో), అండర్సన్ పీటర్స్‌(గ్రెనెడా), జులియన్ వెబర్(జర్మనీ), కర్టిస్‌ థాంప్సన్‌(అమెరికా) నుంచి నీరజ్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన నీరజ్ ఆఖరిదాకా పోరాడినా.. అతడికి రజత పతకమే (85.83 మీ) లభించింది. రుమేశ్‌ పతిరగె(శ్రీలంక) 89.75 మీటర్ల త్రో వేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్