సూర్యాపేట (తెలంగాణ) : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గొడ్డలితో దాడి చేయడంతో మంద వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో వ్యక్తి సైదా కూడా తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేప చెట్టు వివాదం - ఇద్దరు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)