ప్రజాశక్తి-ప్రత్తిపాడు (కాకినాడ) : హైదరాబాదులో సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి వైసీపీ పిఎసి నాయకులు ముద్రగడ పద్మనాభం ను శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ ప్రతిపక్ష నేతబొత్స సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యేలుతోట త్రిమూర్తులు, జక్కంపూడి రాజా, దవులూరి దొరబాబు, తదితర నాయకులు పరామర్శించారు. వారంతా ఇప్పటికే హైదరాబాద్ కు తరలి వెళ్లారు. గురువారం వైసిపి నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ముద్రగడను పరామర్శించారు. గిరిబాబుకు ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని పార్టీ అండగా ఉంటుందని ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించామని తెలిపారు.
ముద్రగడకు వైసిపి నాయకుల పరామర్శ
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 26, 2026, 12:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)