యువ హీరో తేజ సజ్జ నటించిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్గా 'జాంబీ రెడ్డి 2' తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ యువ నటి షనాయా కపూర్ కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చిత్రబృందం షనాయా కపూర్తో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాతోనే ఆమె తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.








కామెంట్లు (0)