బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్న నైరుతి రుతుపవనాలు

1 గంట క్రితం

Southwest monsoon set to revive across the country
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 10:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

* జూలై మూడోవారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం : ఐఎండి


గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈ రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ తాజా అల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ప్రధానంగా మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా), తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. వ్యవసాయ పనులకు ఈ వర్షాల పునరాగమనం ఎంతో కీలకం కానుంది. వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వార్త పెద్ద ఊరటనిస్తోంది.


ఈ అల్పపీడన వ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే కొద్దీ దేశంలోని అంతర్గత ప్రాంతాలలో మేఘాలు దట్టంగా అలముకుని, రాబోయే వారం రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్