సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన సాదిక్ ఖాన్ విచారణ - కాసేపట్లో కోర్టులో హాజరు

1 గంట క్రితం

Sadiq Khan's questioning concludes – to appear in court shortly.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 02:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కాకినాడ : కాకినాడ జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్ పోలీసుల ప్రాథమిక విచారణ పూర్తయింది. సర్పవరం పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం, పోలీసులు నిందితుడిని కట్టుదిట్టమైన భద్రత నడుమ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే అతడిని న్యాయస్థానంలో హాజరుపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


నూకరాజు కుటుంబం దారుణంగా ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి నిందితుడు సాదిక్ ఖాన్ పరారీలో ఉన్నాడు. పోలీసుల ప్రత్యేక బృందాలు గాలించి అతడు ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో దాక్కున్నట్లు గుర్తించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత నిందితుడిని రైలు మార్గం ద్వారా కాకినాడ జిల్లాలోని మేడపాడుకు చేర్చి, అక్కడి నుంచి అత్యంత భద్రతా వలయంలో సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసు ప్రాముఖ్యత దృష్ట్యా విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు సీఐలతో కూడిన ఈ ఉన్నత స్థాయి బృందం, సోమవారం ఉదయం నుంచి సాదిక్ ఖాన్‌ను పలు కోణాల్లో సుదీర్ఘంగా విచారించింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన తీవ్ర పరిస్థితులు, బెదిరింపులు, ఆర్థిక వేధింపులు మరియు ఈ నేరంలో అతడి ప్రమేయంపై కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు సమాచారం. పోలీసుల విచారణ ప్రక్రియ పూర్తికావడంతో, సాదిక్ ఖాన్‌ను వెంటనే కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్) తీసుకెళ్లారు. వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం, నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్