నెల్లూరు : సామాజిక శంఖారావంలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆలు తిరుపాలు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు ప్రసంగించారు. అనంతరం కలెక్టర్ వినతిపత్రం సమర్పించారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మౌనం రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, వ్యాకాస జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్రావు, వ్యాకాస జిల్లా అధ్యక్షుడు వెంకమ్మరాజు. తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరులో సామాజిక శంఖారావం ర్యాలీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)