- ఆరుగురు మృతి
సూర్యాపేట: జిల్లాలో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట సమీపంలో కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 23 మంది గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.






కామెంట్లు (0)