తిరుపతి : మాజీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల తరువాత పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతూ తన కుటుబంతో కలిసి తిరుమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం తిరుమల ఆలయం దర్శనం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజా గళాన్ని పార్లమెంటు, అసెంబ్లీలో వినిపించడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. ప్రజల సమస్యలను లేవనెత్తే వారి తరుపున పోరాడే వేదికగా ఈ పార్టీ నిలుస్తుందని అన్నారు. ఆయన తిరిగి ఆయన రాజకీయాల్లోకి రావడంపై గత 19 నెలలుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.







కామెంట్లు (0)