ప్రజాశక్తి - సూళ్లూరుపేట : ఇస్రో శ్రీహరికోటలోని ఎస్డిఎస్సి షార్లో యువికా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు వారంరోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. యువ విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత,అంతరిక్ష శాస్త్రం మరియు అంతరిక్ష అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి యువికాను రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ 2025 డిసెంబర్ 18న ఒమన్లో పర్యటించిన సందర్భంగా, అక్కడి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇస్రో శ్రీహరికోటలోని ఎస్డిఎస్సి షార్ లో ఒక వారం పాటు ఈ కార్యక్రమం కోసం ప్రణాళిక రూపొందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ( ఎంఈఏ ) ద్వారా ప్రాసెస్ చేసింది. దీనికి కొనసాగింపుగా, ఒమన్ సుల్తానేట్ విద్యా మంత్రిత్వ శాఖ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒమానీ పాఠశాలల నుండి ఎనిమిది మంది విద్యార్థులను మరియు ఇద్దరు పరిశీలకులను నామినేట్ చేసింది. ఈ కార్యక్రమాన్ని 13 జూలై, 2026న ఎస్డిఎస్సి షార్ డైరెక్టర్ ఎస్.ముత్తుచెజియన్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తరగతి గది శిక్షణ, ప్రయోగాల ఆచరణాత్మక ప్రదర్శనలు, రోబోటిక్ కిట్లతో ప్రత్యక్ష అనుభవం, మోడల్ రాకెట్రీ,క్షేత్ర పర్యటనలు, ఇస్రో శాస్త్రవేత్తలతో చర్చలు ఉంటాయి.
షార్ లో యువికా కార్యక్రమం ప్రారంభం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 16, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)