సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గూగుల్ డేటా సెంటర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న సిపిఎం నేతల అరెస్ట్

2 గంటల క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 08:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆనందపురం : ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణ అంశంపై రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సిపిఎం నాయకులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిపిఎం మాజీ కౌన్సిలర్ గంగారావు, భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి తదితర నాయకులను జాతీయ రహదారి వద్ద పోలీసులు అడ్డగించి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పార్టీ నాయకులు తెలిపారు. రైతులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్