ప్రజాశక్తి - యంత్రాంగం : ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ ఛార్జి, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ లో భాగంగా శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్ టి ఎ రద్దు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు అధిక సంఖ్యలో పోలీసులను మోహరించారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో అధ్యాపకులు, విద్యార్థులు గేటు బయట ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు జోక్యం చేసుకోని వారిని లోపలి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలకు పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ నేపథ్యంలో అధ్యాపకులు తల్లిదండ్రుల విజ్ఞప్తితో లోపలికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. అనంతరం విద్యార్థి సంఘాలు అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రధాన రహదారుల ర్యాలీ చేపట్టారు.

ఒంగోలు గ్రౌండ్ లో బంద్ కు మద్దతుగా ప్లేయర్స్...

విజయనగరం జిల్లా : విద్యా సంస్థల బంద్ కు సహకరించాలని బస్సులు నిలిపివేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు
శ్రీకాకుళం జిల్లాలో విద్యాశాఖ మంత్రి రాజీనామా విద్యార్థి సంఘాల బంద్







కామెంట్లు (0)