ప్రజాశక్తి-అమరావతి : ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రుల ఫొటోలు లేకపోవటం సరికాదన్నారు. వెలిగొండ, పోలవరం ఎల్ఎంసీ ప్రకటనల్లో మంత్రి రామానాయుడు ఫొటో లేకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు. తప్పులు పునరావృతం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రారంభానికి జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో పని చేశాయన్నారు. రామానాయుడు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ పని బాగా చేశారంటూ అభినందించారు.
ప్రొటోకాల్ ఉల్లంఘనపై సిఎం చంద్రబాబు సీరియస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 06:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు





కామెంట్లు (0)