కేంద్రంలో బిజెపికి కౌంట్ డౌన్ మొదలైందని, యువతలో వచ్చిన తిరుగుబాటుకు సమాధానం చెప్పలేక ఇప్పుడు నీట్పై చర్చకు సిద్ధమని మోడీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న ఆగస్టు 1లోపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని ఆయన హెచ్చరించారు.