న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని జెఎస్డబ్ల్యు స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్ త్రైమాసికంలో రెట్టింపు లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.2,209 కోట్లతో పోల్చితే గడిచిన త్రైమాసికంలో రూ.4,696 కోట్లకు చేరుకున్నాయి. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 43,497 కోట్ల నుండి రూ. 48,088 కోట్లకు పెరగగా, ముడి ఉక్కు ఉత్పత్తి 3 శాతం వృద్ధితో 6.59 మిలియన్ టన్నులకు చేరుకుంది. వ్యయాలు స్వల్పంగా పెరిగి రూ. 41,830 కోట్లుగా నమోదయ్యాయి.
జెఎస్డబ్ల్యుకు రెట్టింపు లాభాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 11:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)