- టీఎస్పీటీఏ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది లోపు విద్యార్థుల సంఖ్య ఉంటే, వాటికి స్కావెంజర్ గ్రాంట్స్ ను నిరాకరిస్తూ జారీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలంగాణ స్టేట్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్పీటీఏ) విమర్శించింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ అలీ, ఆర్. రోహిత్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం దృష్టిలో అవి పాఠశాలలు కావా? అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం తన తప్పును సవరించుకొని వెంటనే సవరణ ఆదేశాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.






కామెంట్లు (0)