ప్రజాశక్తి - నిజాంపట్నం (బాపట్ల) : మండలంలోని గోకర్ణ మఠం గ్రామం అంగన్వాడి నందు అంగన్వాడి వర్కర్స్ కి అంగన్వాడీ హెల్పర్స్ కి ఇంకా ఈ గ్రామంలో మహిళలకి POSCO ACT గురించి చైల్డ్ మ్యారేజ్ గురించి సైబర్ క్రైమ్ గురించి వారి పిల్లల భద్రత, బాధ్యత సంక్షేమం గురించి బుధవారం ఐసిడిఎస్ సీడీపీఓ అనసూయ అవగాహన కలిగించారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అందించే సేవల గురించి అనగా సఖి వన్ స్టాప్ సెంటర్ , బాలసదనం, గురించి కూడా వారికి అవగాహన కలిగించడం జరిగింది. Dcpu డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఈ విభాగంలో 0 to 18 పిల్లల కోసం పని చేస్తారు. ఇందులో 1098 కి చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చే సమస్యలను పరిష్కరిస్తారు. Saa స్పెషలైడ్ అడాప్షన్ ఏజెన్సీ, ఇందులో గవర్నమెంట్ ద్వారా లీగల్ గా దత్తత అందిస్తారు. Osc వన్ స్టాప్ సెంటర్, ఇందులో మహిళలకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ఐసీడీస్ సూపెర్వైజర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి లీగల్ ఆఫీసర్ మౌనిక, ఓ ఆర్ డబ్ల్యు సుస్మిత పాల్గొన్నారు.
సైబర్ క్రైం పై అవగాహన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 24, 2026, 05:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)