ప్రజాశక్తి - చిత్తూరు : మంచికి మారుపేరు అజాతశత్రువుగా పేరుపొందిన చౌడేపల్లి సీనియర్ రిపోర్టర్ ఇక్కలూరి రాజేష్(43) మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటు. ఆది నుంచి వివాద రహితుడుగా పేరుపొందిన ఆయన అనేక సంస్థలలో పనిచేశాడు. మనం, ఆంధ్ర నాడు, సూర్య వంటి పత్రికలలో పనిచేశారు. ప్రస్తుతం ప్రజాశక్తి లో పనిచేస్తున్నా డు. మృతుడి తండ్రి ఇక్కలూరి కృష్ణయ్య మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య సంగీత, కుమార్తెలు సౌమ్య, భవ్యశ్రీలు వున్నారు. సౌమ్యకు ఇటీవల అనంతపురం లో వివాహం జరిగింది. భవ్య శ్రీ ప్రస్తుతం మదనపల్లి సిద్ధార్థ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. దిగువ మధ్యతరగతి కుటుంబం కావడంతో మృతుడు రాజేష్ టెంట్ హౌస్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అతను.. మంగళవారం ఉదయం గుండెనొప్పితో మరణించాడు. దీంతో కుటుంబంతో పాటు చౌడేపల్లి శోకసంద్రమైంది. మృతుడు రాజేష్ ఎపిడబ్ల్యూజేఎఫ్ యూనియన్లో చురుకుగా పాల్గొంటూ యూనియన్ పిలుపుమేరకు పలు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేశారు. రాజేష్ మృతి పట్ల ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకులు చౌడేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
చౌడేపల్లి సీనియర్ రిపోర్టర్ ఇక్కలూరి రాజేష్ మృతి
35 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)