ప్రజాశక్తి-ఏలూరుస్పోర్ట్స్ : ఏలూరు రూరల్ పదోని మాదేపల్లి ప్రాంతంలో యువకుడు ఉరేసుకుని అనుమానాస్పద మృతి చెందాడు. సంబంధిత వివరాల ప్రకారం .... ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన చోడిగింజల సతీష్ (22) స్థానికంగా కార్పెంటర్ పనులు చేస్తూ భార్యతో కలిసి జీవిస్తున్నాడు. సంతానం లేదు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సతీష్ ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని అనుమానాస్పద మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ఉరేసుకొని యువకుడు అనుమానాస్పద మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 12:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)