సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

యాత్రికుడికి సిపిఆర్ చేసి కాపాడిన కోటనందూరు ఎస్ఐ

1 గంట క్రితం

Kotananduru SI saves traveler by performing CPR.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : అమలాపురానికి చెందిన వ్యక్తి ఆదివారం నాడు తలుపులమ్మ తల్లి దేవస్థానం రావడం జరిగింది. దర్శనం చేసుకుని కొండపై నుంచి దిగి నడుస్తూ వస్తుండగా ఒక్కసారిగా ఆ వ్యక్తికి గుండుపోటు రావడంతో రోడ్డుపైన కుప్పకూలిపోయాడు. కొండపైన విధులు నిర్వహిస్తున్న కోటనందూరు టి. రామకృష్ణ యాత్రికుడు రోడ్డుపై ఒక్కసారిగా కుప్పకూలిపడిపోవడంతో పరుగు పరుగున వెళ్లి ఆ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్