మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో మోసం
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ప్రజాశక్తి-విజయవాడ :అంట్లు తోమే పీచు (స్క్రబర్)తయారీ,ప్యాకింగ్ మిషన్ను కొనుగోలు చేస్తే నెలకు రూ.24వేల వరకు ఆదాయం వస్తుందని వందలాది మందిని మోసం చేశాడో కేటుగాడు.ఈ ప్రచారాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన బాధితులు దీంతో బాధితులు విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఈ వ్యవహారంలో ఎంతమంది బాధితులు ఉన్నారు? వారి నుంచి మొత్తం ఎంత నగదు వసూలు చేశారు? అసలు మిషన్లు ఎంతమందికి అందించారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.







కామెంట్లు (0)