శింగరాయకొండ (ప్రకాశం) : శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కు సోమవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. శింగరాయకొండ మండలం మూలగుంటపాడు శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో అనుమతులకు సంబంధించి పాఠశాల నడవడంతోపాటు హాస్టల్ ఎలా నడుస్తుంది ? దీనికి సంబంధించిన పూర్తి రికార్డులు సమర్పించాలని మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కి వెళ్లి పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 14 వ తేదీన తౌసిక్ అనే విద్యార్థి పాఠశాలలో మరణించాడు. ఆ విద్యార్థి తల్లి మౌలాలి పాఠశాల ముందు గత ఐదు రోజులగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ... పాఠశాల యాజమాన్యానికి విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఓ తల్లి న్యాయపోరాటం - శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కు నోటీసులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 01:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)