మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

1 గంట క్రితం

Woman dies under suspicious circumstances
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 03:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శింగరాయకొండ (ప్రకాశం) : శింగరాయకొండ మండలం మూలగుంటపాడు జాతీయ రహదారి పరిధిలోని రన్వేకి తూర్పు వైపున మూలగుంటపాడు కు వెళ్ళు డొంకలో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. మంగళవారం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సుమారు 50 సంవత్సరాలు వయసు కలిగిన మహిళ గత రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య చేసి అక్కడ వదిలివేసి వెళ్లారా అన్న అనుమానంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్