పలు విభాగాల్లో పతకాల పంట
ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్రీడాస్ఫూర్తిని చాటుతూ పనపాకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారు. తాజాగా తిరుపతిలోని లిటిల్ స్టార్ హైస్కూల్లో ఆగస్టు 10 న నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి యోగా పోటీలలో పనపాకం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.వివిధ విభాగాల్లో పోటీపడి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని పాఠశాలకు వన్నె తెచ్చారు.
వివిధ విభాగాల్లో విజేతల వివరాలు ....
14-16 సంవత్సరాల బాల బాలికల విభాగంలో ఎన్. సంతోష్ ప్రథమ స్థానాన్ని, అరిగిల కుందన శిల్ప ప్రథమ స్థానాన్ని సాధించగా, కె. ఐశ్వర్య ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
12-14 సంవత్సరాల బాల బాలికల విభాగంలో కె. ధనుష్ అగ్రస్థానంలో నిలిచి ప్రథమ స్థానం సాధించగా, వి. వినయశ్రీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు.
10-12 సంవత్సరాల బాల బాలికల విభాగంలో పి. బాలు ద్వితీయ స్థానంలో, ఎ. జ్యోత్స్న తృతీయ స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు.
ఘనంగా అభినందన సభ :
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను పనపాకం పాఠశాలలో ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,ఎ. మంజువాణి అధ్యక్షతన ఈ అభినందన సభ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులను ఈ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యాయామ ఉపాధ్యాయులు వి. జయచంద్ర ప్రత్యేక కృషిని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. పతకాలు సాధించిన విద్యార్థులను, వారికి మార్గదర్శనం చేసిన ఉపాధ్యాయులను గ్రామస్తులు,పాఠశాల సిబ్బంది అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.








కామెంట్లు (0)