ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ : నగర పాలక సంస్థ కార్యాలయం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తయారు చేసిన శకటం ద్వితీయ స్థానంలో నిలిచింది. శనివారం పోలీస్ పరేడ్ మైదానంలో శకటాల ప్రదర్శనలో ‘క్యాచ్ ద రైన్’ వర్షపు నీటిని ఒడిసిపట్టు అనే నినాదంతో , స్వచ్ఛ సర్వేక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ రూపొందించిన శకటం ఆకట్టుకుంది. దీంతో న్యాయ నిర్ణేతలు ద్వితీయ స్థానం సాధించినట్లు ప్రకటించారు. నగరపాలక సంస్థ శకటం ద్వితీయ స్థానం సాధించడం పట్ల కమీషనర్ బాలస్వామి సిబ్బందికి,ఉద్యోగులకు,ఇంజనీరింగ్ అధికారులను ఆయన అభినందించారు.
నగర పాలక సంస్థ శకటానికి ద్వితీయ స్థానం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)