- డాక్టర్ కిరణ్మయి
ప్రజాశక్తి-గణపవరం : గణపవరం ఆరోగ్య కేంద్రం పరిదిలోగల గణపవరం సరిపల్లి అర్దవరం క్రొత్తపల్లి వల్లూరు ఏ గోపవరం గ్రామాల్లో పిల్లలకు వ్యాదినిరోక టికాలు వేస్తున్నట్లు గణపవరం పిహెచ్ సి డాక్టర్ పి కిరణ్మయిసిహెచ్చ్ ఒ జాలాది విల్సన్ బాబు బుధవారం తెలిపారు. టికాలు గర్భవతులు తోపాటు 5 10 16 సంవత్సరాల పిల్లలకు టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రాలు వద్ద మంచినీరు ఓ ఆర్ ఎస్ ప్యాకిట్లు ఉంచాలని చెప్పారు వైద్యసిబ్బంది పిల్లలకు టికాలు వేసేవిధి విధానాన్ని పరిక్షించారు. గర్బవతులు తీసుకోవలిసిన జాగర్తలు పై అవగాహన కల్పించారు. బాలింతలు గర్భీణులు ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో వైద్యసిబ్బంది నున్న పాప జయమ్మ ఎం ఎస్ యేహన్ ఆషాలు పాల్గొన్నారు.








కామెంట్లు (0)