ప్రజాశక్తి - బ్రహ్మంగారిమఠం (కడప) : పొలంలో ఉండగానే గుండెపోటుతో రైతు మృతి చెందిన ఘటన శనివారం చౌదరవారిపల్లి గ్రామంలో జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలంలోని చౌదరవారిపల్లి గ్రామానికి చెందిన అన్నపురెడ్డి రామిరెడ్డి (48) తన వ్యవసాయ పొలంలో నారుమడికి తయారు చేసుకునేందుకు వెళ్లి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అటువైపు పశువులను మేపుకొనేందుకు వెళుతున్న ఓ మహిళ చూసి వెంటనే గ్రామస్తులకు తెలపడం జరిగింది. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన రామిరెడ్డిని అతడి నివాస గృహానికి తీసుకువెళ్లారు.
పొలంలో ఉండగానే ... గుండెపోటుతో రైతు మృతి
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 12:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)