బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు : నాంపల్లి కోర్టు ఆదేశం

5 గంటల క్రితం

Sandhya Theatre Stampede Case: Nampally Court Order
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద చోటుచేసుకున్న విషాదకర తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసు విచారణను నాంపల్లి కోర్టు ఆగస్టు 17కి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంలో న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా ఈ కేసులోని ముగ్గురు నిందితులు కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. హీరో అల్లు అర్జున్‌కు ఇప్పటికే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఛార్జ్‌షీట్‌తో పాటు కేసులోని డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను తమకు ఇంకా అందజేయలేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన న్యాయస్థానం... ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అన్ని డిజిటల్ ఆధారాలు, వీడియో ఫుటేజీలు, పత్రాల కాపీలను తదుపరి విచారణ నాటికి నిందితుల న్యాయవాదులకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్