సౌత్ డకోటా : అమెరికా 250వ వార్షికోత్సవానికి (జూలై 4) ఒక రోజు ముందు శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) మౌంట్ రష్మోర్లోని బ్లాక్ హిల్స్పై చెక్కబడిన అమెరికన్ దిగ్గజాలకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ నివాళులర్పించారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన దేశ పితామహుడైన జార్జ్ వాషింగ్టన్కు, స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన థామస్ జెఫర్సన్కు, మన ఐక్యతకు రక్షకుడైన అబ్రహం లింకన్కు, అమెరికాను ప్రపంచ అగ్రరాజ్యంగా నిర్మించిన థియోడర్ రూజ్వెల్ట్కు మేము సెల్యూట్ చేస్తున్నాము అని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అలాగే అలాంటి మహనీయుల నాయకత్వం ఒక గొప్ప ప్రమాణాన్ని నెలకొల్పిందని, అది అమెరికన్ వ్యక్తిత్వాన్ని ఇప్పటికీ నడిపిస్తోందని ట్రంప్ చెప్పారు. ఇటువంటి వ్యక్తులు కేవలం అమెరికాలో మాత్రమే ఉండగలరు అని ఆయన కొనియాడారు. వారు చేసిన పనుల వల్ల మాత్రమే కాదు, మనం ఎవరన్న విషయాన్ని మనకు ఎప్పటికీ గుర్తుచేయడానికి వారి ముఖాలు ఈ కొండరాళ్లపై చెక్కబడి ఉన్నాయి. ఈ వీరులు అమెరికన్ వ్యక్తిత్వంలోని కాలాతీతమైన, చిరస్థాయిగా శాశ్వతమైన లక్షణాలకు నిదర్శనంగా నిలుస్తారు. మానవ చరిత్రలో మరే ఇతర సమాజం సాధించని దానికంటే ఎక్కువ ప్రగతిని ఈ 250 ఏళ్లలో సాధించిన ఒక గణతంత్ర రాజ్యానికి వీరిని రూపకర్తలుగా ట్రంప్ అభివర్ణించారు. వీరే స్వేచ్ఛను ప్రకటించారు, స్వేచ్ఛను సాధించారు, స్వేచ్ఛను కాపాడారు, స్వేచ్ఛకు భరోసా కల్పించారు అని ఆయన అన్నారు.







కామెంట్లు (0)