శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వియత్నాంలో పడవ ప్రమాదం.. మృతుల్లో తెలుగు రాష్ట్రాల టూరిస్టులు

2 గంటల క్రితం

Boat accident in Vietnam... Tourists from Telugu states involved.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హనోయ్ (వియత్నాం) : వియత్నాంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఫు క్యూక్ ద్వీపం సమీపంలో జరిగిన ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు సమాచారం. స్థానిక మీడియా కథనాల ప్రకారం .... 15 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన పడవలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం.


ఓ మొబైల్ ఫోన్ కంపెనీ తన డీలర్ల కోసం వియత్నాంలో వ్యాపార పర్యటనను ఏర్పాటు చేసింది. ఈ పర్యటనలో భాగంగా మొత్తం 250 మంది భారతీయ డీలర్లు పాల్గొన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 35 మంది, తెలంగాణకు చెందిన 40 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ పర్యటనలో భాగంగా మూడు పడవల్లో సముద్ర విహారానికి వెళ్లగా, శనివారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో ఒక పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడి మునిగిపోయినట్లు సమాచారం. ప్రమాదం సంభవించిన సమయంలో ఆ పడవలో 70 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ చర్యలు చేపట్టాయి. పలువురిని రక్షించి ఆసుపత్రులకు తరలించగా, వారిలో కొందరు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన ఓ మహిళ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి వివరాలపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. సహాయక చర్యలను స్థానిక అధికారులతో కలిసి సమన్వయం చేస్తున్నట్లు తెలిపింది. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్