ఢిల్లీ: ఉజ్బెకిస్థాన్లో ఓ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. కేరళంలోని అలప్పుళ జిల్లా హరిపాడ్కు చెందిన సవారియా బసంత్ (21), మలప్పురం జిల్లాకు చెందిన సదరుల్ అనం (22) ఇద్దరూ ఉజ్బెకిస్థాన్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఈ నెల 3న వీరిద్దరి మధ్య హాస్టల్ గదిలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన సదరుల్ ల్యాప్టాప్తో సవారియాపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉజ్బెకిస్థాన్లో కేరళం వైద్య విద్యార్థిని దారుణ హత్య
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 09:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)