కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ 2పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం శుక్రవారం ట్రైలర్ను విడుదల చేసింది. నీటి సమస్యలు, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన సర్దార్ తొలి భాగానికి ఇది సీక్వెల్. ఇందులో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్నారు. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది.
సర్దార్ 2 ట్రైలర్ విడుదల
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 31, 2026, 08:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)