పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో జరిగిన బాంబు పేలుడులో తొమ్మిది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో వందలాది మంది శాంతి ర్యాలీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.పేలుడు అనంతరం ఘటనాస్థలానికి భద్రతా బలగాలు, సహాయక బృందాలు చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో భారీ పేలుడు.. 9 మంది మృతి
21 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 07:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)