హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఎస్ఎంఇ 100’ అవార్డుల కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన 50 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఎంపిక చేసినట్లు ఇండియా ఎస్ఎంఇ ఫోరం వెల్లడించింది. తయారీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని గుర్తించి ఈ ఎంపిక చేసినట్లు తెలిపింది. ఎంపికైన సంస్థలకు జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని ఇండియా ఎస్ఎంఇ ఫోరం అధ్యక్షుడు వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఎస్ఎంఇ అవార్డులకు ఎపి నుంచి 50 పరిశ్రమల ఎంపిక
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 09:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)