ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరేళ్ల తర్వాత గ్వాంగ్‌జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు

11 గంటల క్రితం

india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ పునరుద్దరణ

న్యూఢిల్లీ : కరోనా తర్వాత తూర్పు లడక్ సరిహద్దు వివాదాల కారణంగా గత ఆరేళ్లుగా నిలిచిపోయిన గ్వాంగ్‌జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులను సెప్టెంబర్ 21 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ శనివారం ప్రకటించింది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఈ కీలక నిర్ణయం వెలువడింది. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితిలోకి తీసుకొచ్చే అంశంలో భాగంగా ఈ సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దక్షిణాసియాలో ఎనిమిది రౌండ్-ట్రిప్ రూట్లలో వారానికి 100కి పైగా విమానాలను నడుపుతున్నామని, ఈ సర్వీసుల పునరుద్ధరణ ఇరు దేశాల మధ్య ప్రయాణ, వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్