ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్, హీరో తిరువీర్ జంటగా నటించిన చిత్రం 'ఓ సుకుమారి`. ఈ చిత్రాన్ని లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. 'ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్గా, పూర్తి వినోదాత్మకంగా ఉంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్లకు ఈ కథాంశం చక్కగా సరిపోయింది` అని చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ సినిమాను గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. జూలై 17న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
‘ఓ సుకుమారి’ ట్రైలర్ విడుదల
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 07:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)