దతియాలో 20 ఏళ్ల తరువాత ఓటమి
భోపాల్ : మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉప ఎన్నికలో ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఈ దతియా స్థానంలో (2023 అసెంబ్లీ ఎన్నికలు మినహాయించి) గత 20 ఏళ్ల నుంచి బిజెపి విజయం సాధిస్తూ వస్తోంది. అలాగే, ఈ దతియా జిల్లా బిజెపి కంచుకోట ఇందుకు అనేక కారణాలు ఉన్నా ముఖ్యమైనది మాత్రం ప్రజా సమస్యలను పరిష్కరించడంపై బిజెపి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడమే. మధ్యప్రదేశ్లో అనేక ఏళ్ల నుంచి బిజెపి అధికారంలో ఉంది. 2023 ఎన్నికల్లో విజయంతో మరోసారి అధికారం చేపట్టింది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి విభజన రాజకీయాలకే బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా దతియా ఉప ఎన్నికలకు కేవలం పది రోజులు ముందు అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా బిల్లును ఆమోదించుకుంది. మైనార్టీలను వేధించడానికే ఈ బిల్లును బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గిరిజనుల నిరసనలు..
కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఛతర్పూర్, పన్నా జిల్లాల్లో గిరిజనులు తమ ఆందోళనను జులై నుంచి పునఃప్రారంభించారు. మెరుగైన పరిహారం, పునరావాసం కల్పించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలు ముందుగా ఏప్రిల్ లో ప్రారంభయ్యాయి. అధికారుల హామీతో అప్పుడు విరమించారు. అయితే ఆ హామీలు అమలు కాకపోవడంతో మళ్లీ నిరసనలకు దిగారు. గిరిజనులతో చర్చలకు ప్రభుత్వం సిద్దంగా లేదు. మరోవైపు నీట్ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా సిజెపి, విద్యార్థులు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు మధ్యప్రదేశ్లోనూ జరిగాయి. విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా బలప్రయోగంతో అణిచివేయాలని చూడ్డం ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. దతియా నియోజకవర్గంలో వలసలు, నిరుద్యోగం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, ఎరువుల కొరత, అస్తవ్యస్త వర్షపాతం, పాతుకుపోయిన బిజెపి స్థానిక రాజకీయ నెట్వర్క్లపై తమ అసంతృప్తిని ఓటర్లు, ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు ఈ ఉప ఎన్నికల్లో కనబర్చారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే దతియా పట్టణ ప్రాంతాల్లో 62 శాతం ఓటింగ్ నమోదు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 80 శాతం నమోదైంది.







కామెంట్లు (0)