- తీవ్రత 3.6గా నమోదు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ) ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమిలోపల 10 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. ఫిబ్రవరిలో కూడా బారాముల్లాలో భూకంపం సంభవించింది. ఆ రోజు 4.6 తీవ్రతతో సంభవించిన భూకంపానికి పటాన్ ప్రాంతం కేంద్రంగా ఉంది.








కామెంట్లు (0)