బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నొయిడాలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో మంటలతో అగ్ని ప్రమాదం .. ఇద్దరు మృతి

2 గంటల క్రితం

noida
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : చార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో మంటలు చెలరేగడంతో నొయిడాలోని నాలుగంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. సెక్టార్‌ 66లోని మమూరా గ్రామంలో ఉన్న ఈ నాలుగంతస్తుల భవనంలో పలు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. బుధవారం ఉదయం భవనంలోని పార్కింగ్‌ ఏరియాలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి చార్జింగ్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న బైక్‌లకు అంటుకోవడంతో, భవనం మొత్తం మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. ప్రమాదం నుండి 50 మందిని రక్ష‍ించారని అన్నారు. ఇంటి యజమానిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్