బెంగళూరు: రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్గా మారనున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలన్నీ వెల్లడిస్తానని, తనను విడుదల చేయాలని కోరుతూ ప్రదోష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రదోష్ వాంగ్మూలాన్ని త్వరలో అధికారికంగా నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ కేసులో ప్రదోష్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్శన్పై నేరం నిరూపణకు అవకాశం ఉందని ఆ వర్గాలు భావిస్తున్నాయి.
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, ఆయన స్నేహితురాలిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.








కామెంట్లు (0)