న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం కావడానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. అనంతరం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్సభ మధ్యాహ్నం 12.00గంటల వరకు వాయిదా పడింది. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఢిల్లీలోని జంతర్మంతర్లో సిజెపి చేపడుతున్న నిరసనపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
నూతన ఎంపిల ప్రమాణ స్వీకారం
రాజ్యసభలో ఎంపిలు పవన్ఖేరా సహా పలువురు ఎంపిలు ప్రమాణం చేశారు. భారతదేశ పరీక్షా విధానంలో నెలకొన్న "వ్యవస్థాగత సంక్షోభం"పై చర్చ జరపాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.








కామెంట్లు (0)