న్యూఢిల్లీ : మూడు యూరోపియన్ దేశాల పర్యటనకు రాష్ర్టపతి ద్రౌపది ముర్ము ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఈ నెల 25 వరకూ ఈ పర్యటన సాగనుంది. మోల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో ఆమె పర్యటించనున్నారు. ఆయా దేశాలతో సంబంధాలను మరింత పెంపొందించుకోవడానికి, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి రాష్ర్టపతి అధికారిక పర్యటనలు చేపట్టారు. ఈ రెండు దేశాల్లో (మోల్డోవా, ఉత్తర మాసిడోనియా) భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. తూర్పు ఐరోపా దేశమైన మోల్డోవాతో ఆ పర్యటన ప్రారంభం అవుతుంది. తరువాత ఉత్తర మాసిడోనియా ఈ నెల 21, 22 తేదీలలో పర్యటించనున్నారు. ఇక్కడ నుంచి పర్యటన చివరి దశలో భాగంగా రొమేనియా ఈ నెల 23, 24, 25 తేదీల్లో రాష్ర్టపతి రొమేనియాలో పర్యటించనున్నారు. మూడు దశాబ్దాల తర్వాత భారత రాష్ట్రపతి ఈ ఆగ్నేయ యూరోపియన్ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
మూడు యూరోపియన్ దేశాల పర్యటనకు రాష్ర్టపతి
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 19, 2026, 11:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)