బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ భవనం కూలిన కేసులో పిజి హాస్టల్‌ నిర్వాహకుని అరెస్ట్‌

49 నిమిషాల క్రితం

Satya Niketan building
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 02:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని సత్యనికేతన్‌ భవనం కూలిన కేసు విచారణలో భాగంగా పిజి హాస్టల్‌ నిర్వాహకుల్లో ఒకరైన సుధాన్షును అరెస్ట్‌ చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఐదంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భవనం లీజ్‌దారుల పాత్రను, భవనం బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌ల్లో జరిగిన మరమ్మత్తు, నిర్మాణ పనులను విచారిస్తున్నారని అన్నారు. ఈ భవనంలో ‘హాస్టల్‌ డేజ్‌’ పేరుతో పీజి హాస్టల్‌ను నిర్వహిస్తున్నారని చెప్పారు. సుధాన్షు, మరో ఇద్దరు ఆ భవనాన్ని హాస్టల్‌ కోసం అద్దెకు తీసుకోవడానికి రెండేళ్ల ముందు వరకు భవనం ఖాళీగా ఉందని స్థానికులు తెలిపారు. మునిసిపల్‌ అధికారులు చేపట్టిన సీలింగ్ డ్రైవ్ అనంతరం, సమీపంలోని హాస్టళ్లు, పీజీలను ఖాళీ చేయిస్తున్నారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా, కూలిపోయిన భవనానికి ఆనుకుని ఉన్న భవనాన్ని కూడా కూల్చివేస్తున్నారని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్